తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభంపై దిగ్విజయ్ సింగ్ కసరత్తు

by Disha Web Desk 2 |
తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభంపై దిగ్విజయ్ సింగ్ కసరత్తు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభంపై ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ కసరత్తు మొదలెట్టారు. కాసేపట్లో అసంతృప్త సీనియర్లతో గాంధీభవన్‌లో భేటీ కానున్నారు. సీనియర్లు ఒక్కొక్కరితో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. ముందుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మధుయాష్కీతో దిగ్విజయ్ సింగ్ చర్చించనున్నారు. కొత్తగా ఏర్పాటైన కమిటీ లోటుపాట్లతో పాటు, మునుగోడు, హుజురాబాద్ ఓటములపై ఆరా తీయనున్నారు. సీనియర్ల భేటీ అనంతరం రాజీనామా చేసిన 12 మంది నేలతోనూ భేటీ కానున్నారు. ఇప్పటికే బుధవారం రాత్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలతో భేటీ అయిన దిగ్విజయ్ సింగ్ కొన్ని వివరాలు సేకరించారు. సమావేశాల అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు మీడియాతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడనున్నారు.

Also Read..

ఉన్నది ఉన్నట్టు: టి- కాంగ్రెస్.. సీ'నియర్' వార్



Next Story

Most Viewed